నేడు ఢిల్లీ అఖిలపక్ష సమావేశానికి సీఎం వైయస్‌ జగన్‌

అమరావతి:ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో  నేడు న్యూఢిల్లీలో జరగనున్న అఖిలపక్ష సమావేశానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు.పార్లమెంట్‌ లైబ్రరీ భవనంలో మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది.మధ్యాహ్నం 1.45కు సీఎం వైయస్‌ జగన్‌ ఢిల్లీకి రానున్నారు. పార్లమెంట్‌ సమావేశాల ప్రామాణికత పెంపు,దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ,75వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి నవభారత నిర్మాణం, మహాత్మాగాంధీ 150వ జయంతి కార్యక్రమం,వెనుకబడిన జిల్లాల అభివృద్ధి తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.ఈ సమావేశానికి హాజరుకావాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రిని ఆహ్వానించింది.
 

Back to Top