రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
రైతు నాగేశ్వరరావుకు వైయస్ జగన్ ప్రభుత్వంలో ఎంతో లబ్ధి
27 Jul 2020 1:01 PM
చిత్తూరు: రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అందరి మాదిరిగానే రైతు నాగేశ్వర్రావు కూడా లబ్ది పొందారు. ఎద్దులు కొనేందుకు కూడా ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్న కేవిపల్లి మండలం మహల్కు చెందిన రైతు నాగేశ్వర్రావు పరిస్థితి సోనూ సూద్ సాయం చేసిన విషయం విధితమే. సోనూ సూద్ దాతృత్వంతో ఆ రైతు ట్రాక్టర్ను సాయంగా పొందారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాగేశ్వర్రావు పొందిన లబ్దిపై కూడా చర్చకు వచ్చింది.
ప్రభుత్వం నుంచి అందిన సహాయం వివరాలు...
1. గత ఏడాది రైతు భరోసా కింద రూ.13,500 నేరుగా నాగేశ్వర్రావు ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం
2. ఈ ఏడాది రైతు భరోసాలో భాగంగా ఇప్పటివరకూ రూ.7500 బదిలీ. మిగతా మొత్తం అక్టోబరు, జనవరిలో బదిలీ
3. నాగేశ్వర్రావు చిన్న కుమార్తెకు ‘జగనన్న అమ్మ ఒడి’ కింద గత జనవరిలో రూ.15,000 అందించిన ప్రభుత్వం
4. పెద్ద కూతురుకు ‘జగనన్న తోడు’ కింద లబ్ధికోసం దరఖాస్తు. చిరు వ్యాపారులకోసం ప్రభుత్వం వడ్డీలేని ఆర్థిక సహాయం ఈ పథకం కింద అందిస్తోంది.
5. నాగేశ్వర్రావు తల్లి అభయహస్తం కింద పెన్షన్ అందుకుంటోంది.
6. నాగేశ్వర్రావు తండ్రి వృద్ధాప్య పెన్షన్ కింద ప్రతి నెలా రూ.2250 అందుకుంటున్నారు.
7. కరోనా సమయంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికి అందించిన రూ.1000 సహాయాన్ని నాగేశ్వర్రావు కుటుంబం పొందింది. ఉచిత రేషన్ కూడా తీసుకుంది.
8. తనకున్న 2 ఎకరాల పొలంలో వేరు శెనగ వేయడానికి రైతు భరోసా కేంద్రం నుంచి డీఏపీ ఎరువు, విత్తనాలను నాగేశ్వర్రావు తీసుకున్నారు.