వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
టీడీపీ కావాలనే సభను అడ్డుకునే ప్రయత్నం
23 Jul 2019 10:13 AM
చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి
అమరావతి: స్పీకర్ చైర్ను అగౌరవపరిచేలా టీడీపీ వ్యవహరిస్తుందని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. చారిత్రాత్మక బిల్లులపై చర్చ జరుగుతుంటే టీడీపీ కావాలనే అడ్డుపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ మైకులను లాగేందుకు టీడీపీ సభ్యులు ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. స్పీకర్ సూచనలను టీడీపీ సభ్యులు పట్టించుకోవడం లేదన్నారు. అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, రామానాయుడులను సస్పెండ్ చేయడం సరైన నిర్ణయమే అని, సభ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు.