మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
చిన్నారి కుటుంబాన్ని ఆదుకున్న సీఎం వైయస్ జగన్
03 Nov 2021 9:34 PM
తాడేపల్లి: గతేడాది విజయవాడ హనుమాన్పేటలో ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి కుటుంబాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదుకున్నారు. చిన్నారి తల్లిదండ్రులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా బాధిత తల్లిదండ్రులకు రూ. 10 లక్షల ఆర్థిక సాయంతో పాటు చిన్నారి సోదరుడికి అవుట్ సోర్సింగ్లో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు వెంటనే రూ. 10 లక్షల చెక్ను చిన్నారి తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు అందజేశారు.
కృష్ణా జిల్లా, రెడ్డిగూడెం మండలం, శ్రీరాంపురానికి చెందిన వీరమల్ల పెద్ద జమలయ్య, ఏసమ్మల కుమార్తె చిన్నారిని విజయవాడ హనుమాన్పేటలో గత ఏడాది అక్టోబర్లో అదే గ్రామానికి చెందిన నాగభూషణం పెట్రోల్ పోసి నిప్పంటించగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి కుటుంబ పరిస్థితిని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతో తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. రూ. 10 లక్షల చెక్ను వెంటనే ఇవ్వాలని ఆదేశించడంతో, సీఎంవో అధికారులు బాధిత కుటుంబానికి చెక్ అందజేశారు. అంతేకాక మృతురాలి సోదరుడికి కూడా వెంటనే అవుట్ సోర్సింగ్లో ఉద్యోగాన్ని కల్పిస్తూ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎంవో అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.