సమగ్ర భూసర్వేపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: సమగ్ర భూ సర్వేపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సీఎస్‌ నీలం సాహ్ని, సీసీఎల్‌ఏ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ కమిషనర్‌ అండ్‌ ఐజి సిద్ధార్థ జైన్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భూసర్వే నిర్వహణకు సంబంధించిన పలు విషయాలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఉన్నతాధికారులతో చర్చించారు. 
 

Back to Top