వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
48 గంటల్లో నాణ్యమైన ఎరువులు అందించాలి
23 Jun 2020 5:17 PM
2018 రబీ బీమా సొమ్ము రూ.596 కోట్లు జూన్ 26న చెల్లిస్తాం
వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్ష
తాడేపల్లి: గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన 2018 రబీకి సంబంధించిన రూ.596 కోట్ల బీమా సొమ్మును జూన్ 26న చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. దీని ద్వారా దాదాపు 5 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయం శాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రైతులు ఆర్డర్ ఇచ్చిన 48 గంటల్లో నాణ్యమైన ఎరువులు డెలివరీ చేయాలని అధికారులను ఆదేశించారు. పంటలు కొనుగోలు చేయాలన్నా.. ఇనుఫుట్ సబ్సిడీ ఇవ్వాలన్నా.. బీమా, పంట రుణాలు ఇవ్వాలన్నా ఈ–క్రాపింగ్ చాలా ముఖ్యమన్నారు. అగ్రికల్చర్, రెవెన్యూ అసిస్టెంట్లు దీన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. హార్టికల్చర్, ఫిషరీస్ కూడా ఈ–క్రాపింగ్లో నమోదు కావాలని అధికారులను ఆదేశించారు.