ఒడిశా సీఎంతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ భేటీ

ఒడిశా: ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఘనస్వాగతం పలికారు. ఒడిశా సచివాలయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. ఉభయ రాష్ట్రాల అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల సమస్యపై సీఎం వైయస్‌ జగన్‌ చర్చించనున్నారు. 
 

Back to Top