సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమీషనర్‌ ఆర్‌.ఎం. బాషా

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డిని నూత‌నంగా నియ‌మితులైన చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమీషనర్‌ ఆర్‌. మహబూబ్‌ బాషా, ఇన్ఫర్మేషన్‌ కమీషనర్‌ శామ్యూల్‌ జొనాథన్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో వారు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. రాష్ట్ర ముఖ్య సమాచార కమీషనర్, రాష్ట్ర సమాచార కమీషనర్‌గా ప్రమాణం చేసిన అనంతరం ఆర్‌.ఎం. బాషా, శామ్యూల్, ఇరువురి కుటుంబ సభ్యులు  ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Back to Top