కాలవ శ్రీనివాసులు నీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రా...ప్రజాకోర్టులో తేల్చుకుందాం. మేమంతా సిద్ధం - 20వ రోజు షెడ్యూల్బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా?
చంద్రబాబు పాలనలో పేదలకు అన్యాయం
18 Jun 2019 11:07 AM
దళిత,గిరిజన,బహుజనులకు దిక్సూచి వైయస్ఆర్
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో దివంగత మహానేత వైయస్ఆర్ పాలనను సువర్ణ అక్షరాలతో లిఖించాలని వైయస్ఆర్సీపీ వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు.ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. సమాజంలో ఉన్న దళిత,గిరిజన,బహుజన కుటుంబాలకు వైయస్ఆర్ దిక్సూచి లాంటి వారని కొనియాడారు.సంక్షేమాన్ని,అభివృద్ధిని రెండు కళ్లుగా ప్రజలకు అందించిన మహానీయుడని తెలిపారు.అంబేద్కర్ ఆలోచన విధానంలో పనిచేసిన వ్యక్తి వైయస్ఆర్ అని అన్నారు.
సాచురేషన్ విధానంలో పేదలందరికి అనేక సహాయాలు చేశారన్నారు.విద్యా వ్యవస్థను మెరుగుపరిచి పేదల స్థితిగతులను మార్చిన వ్యక్తి వైయస్ఆర్గా పేర్కొన్నారు.విద్యార్థులకు 30 శాతం స్కాలర్షిప్పులు పెంచిన మహానీయుడు వైయస్ఆర్ అని తెలిపారు.వైయస్ఆర్ హయాంలో పేదలకు న్యాయం జరిగిందన్నారు.వైయస్ఆర్ పేదలకు లక్షల ఎకరాలు పంచారన్నారు.చంద్రబాబు అంబేద్కర్ స్మృతివనం కడతామని కట్టలేదన్నారు.చంద్రబాబు హయాంలో ఎస్సీ కార్పొరేషన్లో అవినీతి జరిగిందన్నారు.రూ.700 కోట్లు అవినీతి జరిగినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.