చంద్ర‌బాబుకు ఓట‌మి భ‌యం 

ఉనికి కోసమే బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లు 

వైయ‌స్ జ‌గ‌న్ సీఎం కావ‌డం ఖాయం 

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొర‌ముట్ల శ్రీనివాసులు

తిరుపతి: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, ఉనికి కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని  వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబుకు తెలుసన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, జాతీయ సర్వేలు ఇదే చెబుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రజలు వైఎస్‌ జగన్‌ను నమ్ముతున్నారని, వైఎస్సార్‌సీపీకి పక్కాగా 130 సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. లగడపాటి రాజగోపాల్‌ సర్వే చేయకుండా అబద్దాలు చెప్పారని ఆరోపించారు.  

Back to Top