కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
సినీ హీరో భాను చందర్ వైయస్ఆర్సీపీలో చేరిక
09 Jan 2019 11:38 AM
శ్రీకాకుళం : సంకల్ప యోథుడు జగన్మోహన్ రెడ్డి మోగించిన యాత్రాభేరి నలుదిశలా ప్రతిధ్వనిస్తూ వంచకుల హృదయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన తలపెట్టిన సంకల్పం ఎన్ని అవరోధాలెదురైనా వెనుతీయని ఉత్తుంగ తరంగంలా ముందుకు ఉరుకుతూ పతాక స్థాయికి చేరింది. ప్రజాసంకల్ప యాత్ర గురి తప్పని శరంలా.. జనం నోటి జానపదంలా మున్ముందుకే సాగుతోంది. అలుపెరగని పథికుడి ఆత్మస్థైర్యం మరెందరో జనహితాభిలాషులను దగ్గర చేరుస్తోంది. ఆయన అడుగులో అడుగు వేసి ప్రజాసేవలో పాలుపంచుకోవడానికి వీలుగా వైయస్ఆర్సీపీలో చేరిన రాజకీయ నాయకులు, సంఘ సేవకులు, వివిధ రంగాల ప్రముఖుల సంఖ్య లెక్కకు మిక్కిలిగా ఉంది.
ఈ పరిణామం పచ్చదళం గుండెల్లో గుబులు రేకెత్తిస్తోంది. పైకెంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా.. ఈ ఆదరణ టీడీపీని హడలెత్తిస్తోంది. తాజాగా సినీ హీరో భాను చందర్ వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరారు. పార్టీలో ఇప్పటికే సినీ నటులు రోజా క్రియాశీలంగా ఉన్నారు. ఇంకా అనేక మంది నటులు పార్టీలో ఉన్నారు. పాదయాత్రలో సినీ రంగానికి చెందిన కృష్ణుడు, ప్వధ్వీ, పోసాని కృష్ణమురళి ఇలా అనేక మంది జననేతకు సంఘీభావం తెలిపారు.