కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ప్రతిభ కలిగిన ప్రతి క్రీడాకారుడిని ప్రోత్సహిస్తాం
23 Aug 2021 5:04 PM
శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి
రాజమహేంద్రవరం: సింధూ, రజనీలను ప్రొత్సహించినట్లే ప్రతిభ కలిగిన ప్రతి క్రీడాకారుడిని ప్రొత్సహిస్తామని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి స్పష్టం చేశారు. సీఎం వైయస్ జగన్ ఆశీస్సులతో రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఎంపీ భరత్ రామ్ నిర్వహిస్తున్న రాజన్న రచ్చబండ కార్యక్రమంలో బైరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడూతూ..గ్రామస్థాయి నుంచే క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అద్భుతాలు సృష్టించే క్రీడాకారులు గ్రామాల్లో ఉన్నారని, క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినప్పుడే వారికి సరైన గుర్తింపు దక్కుతుందని ఆయన అన్నారు.
ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి స్పోర్ట్స్ పాలసీని తీసుకురావాలని ఆదేశించారు. దీనికోసం రాష్ట్రంలో అన్ని వర్గాల వారి సలహాలు తీసుకుంటున్నామని బైరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వసతులతో క్రీడా అకాడమీలు ఏర్పాటు చేస్తామని సిద్ధార్థరెడ్డి చెప్పారు.