కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
ప్రపంచం మొత్తం ఏపీని ఆదర్శంగా తీసుకోవాలి
25 Jun 2020 7:03 PM
వైయస్ జగన్ సర్కార్పై బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ప్రశంసలు
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వంపై బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ప్రశంసలు కురిపించారు. కరోనా వైరస్ను నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూ ఫ్లెమింగ్ ప్రశంసించారు. పది లక్షల జనాభాకు 14,049 టెస్టులు చేస్తున్నారంటూ.. ప్రపంచం మొత్తం ఏపీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. 11,158 గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బందితో కలిపి 4.5 లక్షల మంది వలంటీర్ల నెట్వర్క్ను ఏర్పాటు చేసిందని, అదే విధంగా క్వారంటైన్ను పర్యవేక్షించడానికి అధికారులను ప్రభుత్వం నియమించిందని ట్వీట్ చేశారు.
కాగా, రాష్ట్రంలో కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 7 లక్షల పైచిలుకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 46.26 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ రేటు 6.20 శాతం ఉండగా ఏపీలో మాత్రం 1.38 శాతంగా ఉంది.