రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాం..
11 Apr 2022 2:24 PM
మంత్రి బొత్స సత్యనారాయణ
అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణ శ్రీకారం చేసే ముందు బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గం కూర్పు అద్భుతంగా ఉందన్నారు. జనాభాలో ఎక్కువగా ఉన్న వారికి సీఎం వైయస్ జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని.. మేం భాగస్వాములవ్వాలన్న బీసీల కోరిక సీఎం వైయస్ జగన్ నెరవేర్చారని ప్రశంసలు కురిపించారు. అసంతృప్తితో ఉన్నవారిని కలుపుకుని ముందుకెళ్తాం.. మేమందరం ఒకటేనని స్పష్టం చేశారు. కేబినెట్పై తీసుకున్న నిర్ణయం మామూలు నిర్ణయం కాదని.. ప్రజల ఆకాంక్ష మేరకు పని చేస్తూ.. ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేందుకు ముందుకు సాగుతామన్నారు.