ముఖ్య‌మంత్రిని క‌లిసిన బ‌ద్వేలు ఎమ్మెల్యే డాక్ట‌ర్ సుధ‌

తాడేప‌ల్లి: బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో అత్య‌ధిక మెజార్టీతో విజ‌యం సాధించి శాస‌న‌స‌భ్యురాలిగా ఎన్నికైన‌ డాక్ట‌ర్ దాస‌రి సుధను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అభినందించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ను ఎమ్మెల్యే దాస‌రి సుధ‌ కడప ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఇటీవల జరిగిన బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన డాక్టర్‌ దాసరి సుధ, పార్టీ నేతలను సీఎం అభినందించారు. 

Back to Top