పంటల బీమా కోసం రూ.2,586.60 కోట్లు విడుదల

 తాడేప‌ల్లి:  వైయ‌స్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద ఖరీఫ్‌–2020 సీజన్‌కు సంబంధించి అర్హులైన రైతులకు బీమా సొమ్ము చెల్లించేందుకు రూ.2,586.60 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తాన్ని రియల్‌ టైం గవర్నెన్స్‌ ద్వారా ఈ నెల 25న ఆధార్‌తో లింక్‌ చేసిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. ఈ మేరకు అర్హుల జాబితాలు సిద్ధం చేసి పంపిణీకి ఏర్పాట్లు చెయ్యాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించారు.

Back to Top