ఏపీలో సీబీఐ దాడులకు మార్గం సుగమం

గత ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు చేసిన వైయస్‌ జగన్‌ సర్కార్‌

అమరావతి:  ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనను వేగవంతం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరి చేస్తున్నారు. గతంలో ఏపీకిలోకి సీబీఐ రాకూడదంటూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవోను వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఏపీలో సీబీఐ దాడులకు మార్గం సగమం అయ్యింది. జనరల్‌ కన్సాల్ట్‌ను గత ప్రభుత్వం రద్దు చేసిన విషయం విధితమే. గత ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొత్త ప్రభుత్వం రద్దు చేసింది. 
 

Back to Top