అన్నదాతకు అండగా ప్రభుత్వం కీలక ఒప్పందాలు

తాడేపల్లి: అన్నదాతకు అండగా వ్యవసాయంలో విప్లవాత్మక మార్పుల దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా ఏర్పాటు చేయబోతున్న రైతు భరోసా కేంద్రాల ఏర్పాటులో భాగంగా పలు స్వామినాథన్‌తో సహా పలు జాతీయ సంస్థలో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను చేసుకుంది. తాడేపల్లిలోని సీఎం వైయస్‌ జగన్‌ సమక్షంలో ఆయా సంస్థలు ప్రభుత్వంతో ఎంఓయూలు చేసుకున్నాయి. చెన్నైలోని స్వామినాథన్‌ ఫౌండేషన్‌తో పాటు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌–న్యూఢిల్లీ, సాయిల్‌ సైన్స్‌ డివిజన్‌–న్యూఢిల్లీ, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌–హైదరాబాద్, సెంట్రల్‌ ఫెర్టిలైజర్‌ క్వాలిటీ కంట్రోల్, శిక్షణ సంస్థ–ఫరీదాబాద్, నేషనల్‌ సీడ్‌ రీసెర్చ్, శిక్షణ సంస్థ–వారణాసి, సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ డ్రైల్యాండ్‌ అగ్రికల్చర్‌–హైదరాబాద్, నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌–కర్నాల్, ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌–ఉత్తర్‌ప్రదేశ్, బెంగళూరుకు చెందిన సదరన్‌ రీజనల్‌ యానిమల్‌ డిసీజ్‌ డయాగ్నోస్టిక్‌ ల్యాబ్, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ హెల్త్‌ అండ్‌ వెటర్నరీ బయోలాజికల్స్, ఐసీఏఆర్‌ సీఐఎఫ్‌ఏ సంస్థలతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. 

Back to Top