వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
హైకోర్టు ఉత్తర్హులపై స్టే ఇవ్వాలి
08 Aug 2020 10:57 AM
స్టేటస్ కో పై సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
ఏపీ వికేంద్రీకరణ చట్టం, సీఆర్డీఏ చట్టం రద్దు స్టేటస్ కో విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్హులపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్హులపై స్టే ఇవ్వాలని సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది.
‘రాజధాని’ ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో తీసుకునే నిర్ణయమే అని, అందులో తమ పాత్రేమీ ఉండదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల హైకోర్టుకు నివేదించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 6 ప్రకారం ఏపీ రాజధాని విషయంలో ప్రత్యామ్నాయాల నిమిత్తం విశ్రాంత ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ 2014 ఆగస్టు 30న ఇచ్చిన నివేదికను కేంద్రం అదే ఏడాది సెప్టెంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపినట్లు వివరించింది. అనంతరం 2015 ఏప్రిల్ 23న అప్పటి రాష్ట్ర ప్రభుత్వమే అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చట్టం’ తెచ్చి జూలై 31న గెజిట్లో ప్రచురించిందని తెలిపింది.
దీని ప్రకారం అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ ఏరియాను శాసన రాజధానిగా, విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ ఏరియాను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ ఏరియాను న్యాయ రాజధానిగా ప్రకటించిందని కోర్టుకు నివేదించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదానివ్వడంతో పాటు పునర్విభజన చట్టంలోని పలు అంశాలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన పోలూరి శ్రీనివాసరావు హైకోర్టులో 2018లో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఈ వ్యాజ్యం విచారణకు రాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఇప్పటి వరకు కౌంటర్లు దాఖలు చేయలేదని శ్రీనివాసరావు తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ కార్యదర్శి స్థాయి అధికారి లలిత టి.హెడావు కౌంటర్ దాఖలు చేశారు.