వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్నెట్లో అవకతవకలు
13 Sep 2021 2:10 PM
ఏపీ ఫైబర్నెట్ ఛైర్మన్ గౌతమ్రెడ్డి
విజయవాడ: చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్ నెట్లో అవకతవకలు జరిగాయని ఏపీ ఫైబర్నెట్ ఛైర్మన్ గౌతమ్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీకి టెండర్ కట్టబెట్టారన్నారు. ఏడాది సస్పెన్షన్ ఉన్నా.. రెండు నెలల్లోనే టెండర్ కట్టబెట్టారన్నారు. టెరా సాఫ్ట్కు టెండర్ కేటాయించేందుకే కాల పరిమితి పొడిగించారన్నారు.
చంద్రబాబు, వేమూరి హరికృష్ణ ప్రసాద్ కలిసే కుట్రకు పాల్పడ్డారని గౌతమ్రెడ్డి మండిపడ్డారు. వేమూరి హరికృష్ణ ప్రసాద్ను టెరా సాఫ్ట్లో రాజీనామా చేయించి ఫైబర్నెట్లో డైరెక్టర్గా తీసుకున్నారన్నారు. టెండర్లలో అవకతవకలపై అభ్యంతరాలను కూడా పరిశీలించలేదని గౌతమ్రెడ్డి ధ్వజమెత్తారు. 19 మందిపై సీఐడీ అనుమనితులుగా కేసులు నమోదు చేసింది. దర్యాప్తు పూర్తయ్యాక మరింత మంది పాత్ర వెలుగులోకి రావొచ్చని గౌతమ్రెడ్డి అన్నారు.