చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలి
10 Aug 2019 7:17 PM
విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
అమరావతి : ప్రతి తరగతికి తప్పనిసరిగా ఒక టీచర్ ఉండాలని, విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఖాళీలను భర్తీ చేయడానికి నియామకాల కోసం క్యాలెండర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శనివారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను మార్చడంపై విద్యాశాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. తొలివిడతలో 12,918 ప్రాథమిక పాఠశాలలు, 3,832 హైస్కూళ్ల రూపురేఖలు మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
టాయిలెట్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, నీళ్లు, ఫర్నిచర్, పెయింటింగ్స్, తరగతి గదులకు మరమ్మతులు, బ్లాక్బోడ్స్ కార్యక్రమాలతో పాటు అదనపు తరగతి గదులను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 98 శాతం అంటే సుమారు 42,655 పాఠశాలల వీడియోలు, ఫొటోలు తీసిన విద్యాశాఖ దాదాపు 10.88 లక్షల ఫొటోలను సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేసింది.
అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాత మళ్లీ ఫొటోలు తీసి ప్రజలముందు ఉంచాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. కొన్నిచోట్ల అన్ని తరగతులకూ ఒకే టీచర్ ఉన్నారన్న విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.