నేడు సీఎం, హైకోర్టుల సీజేల సదస్సు 

హాజ‌రుకానున్న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌

 న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి శనివారం న్యూఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో జరిగే అన్ని రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్‌ గవర్నర్‌లు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో పాల్గొంటారు. సదస్సును ప్రధాని మోదీ, సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రారంభిస్తారు.  తెలంగాణ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌మిశ్రాలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.  

Back to Top