ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలి

తెలుగు ప్ర‌జ‌ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు

తాడేప‌ల్లి:  దీపావ‌ళి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప‌ర్వ‌దినం ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని సీఎం వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Back to Top