‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
ఏపీ కేబినెట్ మీటింగ్ ప్రారంభం
04 Sep 2019 11:18 AM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైంది. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. రేపటి నుంచి అమల్లోకి రానున్న కొత్త ఇసుక విధానంపై కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది.ఇసుక సరఫరా ధరపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీటీడీ పాలక మండలి సభ్యులను 19 నుంచి 25కు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభంకానున్న నాణ్యమైన రేషన్ బియ్యం సరఫరాపై చర్చ జరుగే అవకాశం ఉంది.ప్రతి నెలా కొత్త సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేయనుంది. సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.