కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడేది లేదు
30 Jun 2021 3:05 PM
కేంద్రం దృష్టికి తెలంగాణ వ్యవహారం
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
అమరావతి: రాష్ట్ర ప్రయోజనాలపైన రాజీ పడేది లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతుల హక్కులను హరించేలా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జల వివాదంపై ఏపీ కేబినెట్ తీర్మానం చేసింది. ఏపీ హక్కులకు సంబంధించి రాజీపడేదిలేదని కేబినెట్ స్పష్టం చేసింది. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి విషయంలోనూ.. తెలంగాణ వైఖరిని కేబినెట్ తప్పుబట్టింది. తెలంగాణ వ్యవహారంపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
కేబినెట్ నిర్ణయాలు...
- - రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ ల కొనుగోలుకు మంత్రివర్గం ఆమోదం..
- - నవరత్నాల్లో భాగంగా 28లక్షల ఇళ్ల నిర్మాణానికి భారీ ప్రచార కార్యక్రమం.
- - 9 నుంచి 12 వతరగతి విద్యార్ధులకు ల్యాప్ టాప్ ల పంపిణీకి ఆమోదముద్ర.
- - ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి వర్సిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం.
- - విజయనగరం జేఎన్ టీయూ ఇంజనీరింగ్ కళాశాలను వర్సిటీగా మార్పుకు ఆమోదం.
- - జేఎన్ టీయూ చట్టం 2008 సవరణకు అంగీకారం తెలిపిన మంత్రివర్గం.
- - టిడ్కో ద్వారా 2,62,216 ఇళ్ల నిర్మాణం పూర్తికి మంత్రివర్గం ఆమోదం.
- - మౌలిక సదుపాయల కల్పనకు రూ.5990 కోట్ల మేర బ్యాంకు రుణం హామీకి ఆమోదం.
- - 2021-24 ఐటీ విధానానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం.
- - కాకినాడ పోర్టులో రీ గాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుపై చర్చ.
- - మారిటైమ్ బోర్డుతో సంయుక్త కార్యకలాపాల నిర్వహణకు అనుమతి.
- - రీసర్వే పట్టాదారులకు ధ్రువపత్రాల జారీకి భూహక్కు చట్ట సవరణకు ఆమోదం.
- - విశాఖ నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్ భూ కేటాయింపునకు ఆమోదం.
- - 81 ఎకరాల భూ కేటాయింపుకు అంగీకారం తెలిపిన మంత్రివర్గం .
- - పుట్టపర్తి నియోజకవర్గానికి రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు కింద నీటి సరఫరా.
- - తొలిదశ కింద ఎత్తిపోతల ,గ్రావిటీ ద్వారా నీటి సరఫరాకు అంగీకారం.
- - రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్ సీలకు 539 కొత్త 104 వాహనాల కొనుగోలుకు ఆమోదం.
- - విజయవాడలో గుణదలలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఆమోదం.