రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు
14 Mar 2023 10:15 AM
అమరావతి: నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాసేపట్లో బీఏసీ సమావేశం మొదలు కానుంది. ఆ తరువాత సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం నిర్వహిస్తారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే అజెండాగా నేటి నుంచి బడ్జెట్ సమావేశాలకు అధికార పక్షం సిద్ధమైంది. శాసన మండలితోపాటు శాసనసభ 2023–24 బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. గవర్నర్గా ఆయన బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు శాసనసభలో అడుగుపెడుతున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీ నిర్ణయం తీసుకోనుంది. బీఏసీ సమావేశం అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమవుతుంది. శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులపై చర్చించి ఆమోదించనుంది.