నేటి నుంచి బ‌డ్జెట్ స‌మావేశాలు 

అమరావతి: నేటి నుంచి ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. కాసేప‌ట్లో బీఏసీ స‌మావేశం మొద‌లు కానుంది. ఆ త‌రువాత సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న మంత్రి మండ‌లి స‌మావేశం నిర్వ‌హిస్తారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే అజెండాగా నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలకు అధికార పక్షం సిద్ధమైంది. శాసన మండలితోపాటు శాసనసభ 2023–24 బడ్జెట్‌ సమావేశాల తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జ‌స్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. గవర్నర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు శాసనసభలో అడుగుపెడుతున్నారు. గవర్నర్‌ ప్రసంగం అనంతరం బడ్జెట్‌ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీ నిర్ణయం తీసుకోనుంది. బీఏసీ సమావేశం అనంత‌రం సచివాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమవుతుంది. శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులపై చర్చించి ఆమోదించనుంది. 

Back to Top