వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఉరవకొండ నియోజకవర్గానికి మరో 2500 ఇళ్ళు మంజూరు
15 Nov 2022 12:13 PM
గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్
అనంతపురం: ఉరవకొండ నియోజకవర్గానికి మరో 2500 పక్కా ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి జోగి రమేష్ తెలిపారు. అనంతపురం జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ను నగరంలోని ఆర్&బి లో ఉరవకొండ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఉరవకొండ నియోజకవర్గ సమస్యలు ఆయనకు విన్నవించారు. ప్రస్తుతం మంజూరైన 26 వేల ఇళ్లతో పాటు మరో 2500 నూతన ఇళ్ళు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే మంత్రిని కోరారు. ఇందుకు స్పందించిన మంత్రి వెంటనే 2500 పక్కా ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో మంత్రికి విశ్వేశ్వరరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.