సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదు
చంద్రబాబు ఓ టూరిస్ట్
17 Oct 2020 10:56 AM
బీసీలపై బాబుకు దొంగప్రేమ పుట్టుకొచ్చింది
మంత్రి అనిల్కుమార్ యాదవ్
నెల్లూరు: చంద్రబాబు ఒక టూరిస్ట్ అని.. టూరిస్ట్లా ఏపీకి వచ్చి సాయంత్రానికి ఫ్లైట్ ఎక్కి పోయే ప్రతి పక్షనేతని మంత్రి అనిల్కుమార్ యాదవ్ మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి మాట్లాడే అర్హత కూడా లేదన్నారు. వరదలు వచ్చి కరకట్ట మీద ఇల్లు మునుగుతుంటే.. ఖాళీ చేయకుండా చంద్రబాబు అక్కడే ఉంటాననడం సిగ్గుచేటని మండిపడ్డారు. శనివారం నెల్లూరులో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం వర్షాలతో సుభిక్షంగా ఉంటే చంద్రబాబుకి ఏడుపు ఆగటం లేదన్నారు. కరకట్ట మీద ఉన్న ఇల్లు గురించి ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా చంద్రబాబు మొండికేస్తూ ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేస్తున్నాడని దుయ్యబట్టారు.
ఏం చేశాడో లెక్కలు తీయాలి:
బీసీల మీద మళ్లీ బాబుకి దొంగప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు. బాబు అధికారంలో ఉంటే బీసీలు బిజినెస్క్లాస్ అని, ప్రతిపక్షంలో ఉంటే బ్యాక్వర్డ్క్లాస్ అంటారని.. ఆయనకు దమ్ముంటే బీసీలకు ఏం చేశాడో లెక్క తీయాలన్నారు. ముఖ్యమంత్రిగా సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణం చేశాక, బీసీలకు ఎన్ని సంక్షేమ పధకాలు చేపట్టారో తాము చెబుతామని పేర్కొన్నారు. బీసీల గురించి బాబు మాట్లాడం సిగ్గు చేటని, పచ్చ పత్రికలలో పిచ్చి రాతలు రాయించుకోవడం తప్ప బాబు మళ్లీ అధికారంలోకి రావడం కలని తెలిపారు.