కాసేప‌ట్లో కేబినెట్ భేటీ ప్రారంభం

స‌చివాల‌యం: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న కాసేప‌ట్లో మంత్రిమండ‌లి స‌మావేశం ప్రారంభం కానుంది.  సచివాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెల‌ప‌నుంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటుపై, ఇసుక కార్పొరేషన్ ఏర్పాటుపై మంత్రి మండలి నిర్ణయం తీసుకునే అవకాశముంది. రాయలసీమ కరువు నివారణకు ప్రాజెక్టుల నిర్మాణ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో `నాడు - నేడు` పనులకు ఆమోదం తెలప‌నున్న‌ట్లు స‌మాచారం.

Back to Top