ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
వర్షం కావాలంటే బాబు పోవాలి
22 Feb 2019 3:05 PM
వైయస్ఆర్సీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి
త్వరలోనే యువత డిక్లరేషన్ ప్రకటించేందుకు చర్యలు
రైతులు, మహిళలకు అండగా వైయస్ఆర్సీపీ
వైయస్ జగన్ బీసీ డిక్లరేషన్ను అమలు చేస్తారు
నెల్లూరు: సకాలంలో వర్షాలు రావాలంటే చంద్రబాబు ప్రభుత్వం పోవాలని వైయస్ఆర్సీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ‘వర్షం కావాలంటే బాబు పోవాలి’ అనే కొత్త నినాదాన్ని వెంకటగిరి వేదికగా ప్రాచుర్యంలోకి తీసుకువస్తామని వెల్లడించారు. నియోజకవర్గంలోని యువత ఆకాంక్షలను తెలుసుకునేందుకు మార్చి మొదటివారంలో సమావేశం ఏర్పాటుచేసి వారి అభిప్రాయాలను పార్టీ అధినేత వైఎస్ జగన్కు తెలియజేసి యువత డిక్లరేషన్ ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.‘టీడీపీ ప్రభుత్వం మహిళలు, రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి అండగా ఉంటుందని చెప్పారు. ఆనం రామానారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీ డిక్లరేషన్ను వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తారన్నారు.
దళితులపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు. దళితులుగా పుట్టాలని ఎవరూ కోరుకోరని సీఎం చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనను స్ఫూర్తిగా తీసుకుని చింతమనేని ప్రభాకర్ దళితులను అవమానించారన్నారు. టీడీపీ నేతలు దళితులు, బీసీలు, గిరిజనుల ఓట్లు తమకు అవసరం లేదని ప్రకటించి ఎన్నికలకు రాగలరా అని ప్రశ్నించారు. వెంకటగిరి ప్రాంతాన్ని విద్య, వైద్య, ఆరోగ్య, పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణను రూపొందించి అమలు చేస్తామని తెలిపారు.
వెంకటగిరి రాజాల దాతృత్వంతో ఏర్పాటు చేసిన వీఆర్ విద్యాసంస్థలకు అప్పట్లో వారిచ్చిన స్థలంలో ఒక్క సెంట్ కూడా అన్యాక్రాంతం కాకుండా చూశామన్నారు. అలాగే మరో ఐదెకరాలు కొనుగోలు చేసి వారి పేరుతోనే మరిన్ని విద్యాసంస్థలు ఏర్పాటు చేసిన చరిత్ర తమదని ఆనం తెలిపారు. అయితే వెంకటగిరి రాజాల దానంతో ఏర్పాటైన గోషాస్పత్రిని మూయించి ఆ స్థలాన్ని కబ్జా చేయాలని ఎమ్మెల్యే కురుగొండ్ల ప్రయత్నించారని విమర్శించారు. రాజా కుటుంబీకులకు సరైన గౌరవం కూడా ఇవ్వని అధికారపార్టీ నేతలకు తమను విమర్శించే నైతికత లేదని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు కలిమిలి రామ్ప్రసాద్రెడ్డి, పట్టణ కన్వీనర్ జి.ఢిల్లీబాబు, తిరుపతి పార్లమెంటరీ జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరరావు, ధనియాల రాధ, యస్ధానీబాషా, గూడూరు భాస్కర్రెడ్డి, ఆవుల గిరియాదవ్ పాల్గొన్నారు.