మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
సీఎం వైయస్ జగన్కు హోం మంత్రి అమిత్ షా ఫోన్
26 Apr 2020 5:43 PM
అత్యధిక పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా ఏపీ ప్రథమ స్థానంలో ఉందని వివరణ
నిర్మలా సీతారామన్తో చర్చించిన సీఎం వైయస్ జగన్
తాడేపల్లి: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను అమిత్ షాకు సీఎం వైయస్ జగన్ వివరించారు. ఏప్రిల్ 20 నుంచి ఇచ్చిన సడలింపులు, వాటి అమలుపై అమిత్ షాతో చర్చించినట్టుగా సీఎం అధికారులకు తెలిపారు. లాక్డౌన్ పరిణామాలు, దీని తర్వాత అనుసరించాల్సిన వ్యుహాలపై చర్చించినట్టు చెప్పారు. రాష్ట్రంలో తీసకుంటున్న చర్యలను అమిత్షాకు వివరించడంతోపాటు.. రాష్ట్రంలో విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు సీఎం వైయస్ జగన్ అధికారుల వద్ద ప్రస్తావించారు. ప్రతి మిలియన్ జనాభాకు 1274 చొప్పున అత్యధిక పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా ఏపీ ప్రథమ స్థానంలో ఉందన్నారు.
నిర్మలా సీతారామన్తో చర్చించిన సీఎం వైయస్ జగన్
గుజరాత్లో చిక్కుకుపోయిన తెలుగు మత్య్సకారులను తిరిగి రాష్ట్రానికి రప్పించడంపై సీఎం వైయస్ జగన్ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి, కరోనా నివారణ చర్యల కోసం రాష్ట్రానికి కేంద్రం తరఫున నోడల్ మినిస్టర్గా వ్యవహరిస్తున్న నిర్మలా సీతారామన్తో మాట్లాడినట్టు అధికారులకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ అధికారి సతీష్ చంద్ర చూసుకుంటారని కేంద్ర మంత్రికి తెలియజేశానని.. ఆ మేరకు మంత్రి కార్యాలయం నుంచి ఒక అధికారిని ఇందుకోసం కేటాయించారని సీఎం వైయస్ జగన్ చెప్పారు. ఇద్దరి మధ్య సమన్వయం కుదిర్చి.. తెలుగు మత్స్యకారులను ఏపీకి తీసుకొచ్చేందుకు తగిన ప్రయత్నాలు చేస్తున్నామని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్కు చెప్పినట్టు సీఎం జగన్ వెల్లడించారు. సముద్రమార్గం ద్వారా మత్య్సకారులను తీసుకురావడానికి.. ప్రయాణికులు నౌకకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి సంబంధిత విభాగాల నుంచి అనుమతులు రావాల్సిన అవసరం ఉందని, దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు నివేదించిన నేపథ్యంలో తాను ఈ ప్రయత్నాలు చేసినట్టు ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ అధికారులకు వివరించారు.
డిశ్చార్జి అయిన వారందరికీ కూడా రూ.2 వేలు
రాష్ట్రవ్యాప్తంగా 231 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆరోగ్యంతో ఇళ్లకు వెళ్లారని సందర్భంగా అధికారులు సీఎం వైయస్ జగన్కు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం వైయస్ జగన్.. వారందరికీ కూడా రూ.2వేల రూపాయలు చొప్పున అందించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కొంతమందికి అందించామని, మిగిలిన వారికి కూడా అందజేస్తామని అధికారులు సీఎంకు చెప్పారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కేసుల వివరాలను సీఎంకు వివరించారు. విజయవాడలో కేవలం ఇద్దరు వ్యక్తుల కారణంగా కృష్ణలంకలోని ఒక వీధిలో, కార్మికనగర్లోని ఒక వీధిలో కరోనా కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. అలాగే పశ్చిమగోదావరిలో కూడా ఢిల్లీనుంచి వచ్చిన వ్యక్తి కారణంగా వ్యాపించిందని చెప్పారు.
ప్రజల్లో తీవ్ర భయం, ఆందోళన కలిగించరాదు...
కరోనా వైరస్పై వివిధ ప్రసారమాధ్యమాలు ప్రజల్లో కలిగించిన తీవ్ర ఆందోళన వల్ల సామాజికంగా చోటుచేసుకున్న విపరిణామాలపై సీఎం వైయస్ జగన్ సమావేశంలో అధికారులతో చర్చించారు. వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు స్థానంలో... ప్రజల్లో తీవ్ర భయాందోళనలు, లేనిపోని అపోహలను కలిగించడంపై అధికారులు విచారం వ్యక్తం చేశారు. కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వెళ్లినా స్థానికులు అడ్డుకోవడం, చివరకు అది ఉద్రిక్తతకు దారితీసిన ఒకటిరెండు ఘటనలను కూడా సమావేశంలో అధికారులు సీఎంకు వివరించారు. ఆత్మీయత, మానవత్వం పోయి వివక్ష, విద్వేషం, తక్కువగా చూడ్డం లాంటి భావనలు తలెత్తేలా అక్కడక్కడా చోటుచేసుకున్న పరిణామాలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని మీడియా సంస్థలు విపరీత పోకడ, తీవ్ర ఆందోళన కలిగించేలా ప్రచారం చేస్తుండడం దీనికి కారణమని వైద్య నిపుణులు ఈ సమావేశంలో ప్రస్తావించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ప్రజల్లో తీవ్ర ఆందోళన బదులు ధైర్యం, భరోసా, స్థైర్యం, అవగాహన, జాగ్రత్తలు పాటించేలా, చైతన్యం కలిగించేలా మరిన్ని అడుగులు ముందుకేయాలని ఆదేశించారు.
ప్రజారోగ్య రంగంలో ముమ్మరంగా మౌలిక సదుపాయాలు
కరోనా లాంటి విపత్తను ఎదుర్కోవాలంటే ఆరోగ్య రంగంలో మౌలికసదుపాయాల కల్పన ముమ్మరంగా సాగాలని సీఎం వైయస్ జగన్ స్పష్టం చేశారు. నాడు – నేడు కింద ప్రతిపాదించిన పనులన్నీ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా లాంటి విపత్తులను ఎదుర్కోవాలంటే మౌలిక ఆరోగ్య రంగంలో మౌలికసదుపాయాల కల్పన చాలా అత్యవసరమని, తద్వారా వివిధ రోగాలనుంచి ప్రజల ప్రాణాలు నిలుపుకోగలమని సీఎం వైయస్ జగన్ అన్నారు. కరోనా కాకుండా ఇతర ఎమర్జెన్సీ కేసులపైనా దృష్టిపెట్టాలని సీఎం తెలిపారు. అత్యవసర సేవలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కలగకూడదని చెప్పారు. ప్రణాళిక ప్రకారం ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సుల పోస్టులు భర్తీచేయాలన్నారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
పొగాకు కొనుగోలు చేయండి..
రైతులు నష్టపోకుండా వెంటనే పోగాకు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లాల్లో పోగాకు కొనుగోలు కేంద్రాలు రెడ్జోన్లలో ఉన్నందున టంగుటూరు, కొండెపిల్లో ప్రత్యామ్నాయ వేలంపాట కేంద్రాల ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కూడా పొగాకు కొనుగోలు కోసం వేలంపాట కేంద్రాలు నిర్వహించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రేపటినుంచి వేలంపాటలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించాలని పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల కలెక్టర్లను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.
మాస్క్ల పంపిణీపై ఆరా
మాస్క్లు ధరించడం, పరిశుభ్రమైన వస్త్రాన్ని కప్పుకోవడం లాంటి చర్యలు కరోనా వ్యాప్తి చెందకుండా మేలుచేస్తాయని ఈ సమీక్షలో పాల్గొన్న వైద్య నిపుణులు సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతి మనిషికీ మూడు మాస్కుల చొప్పున పంపిణిపై సీఎం వైయస్ జగన్ ఆరా తీశారు. ఇప్పటికే 1.3 కోట్లకుపైగా మాస్క్లను రెడ్ క్లస్టర్లలో పంపిణీచేశామని అధికారులు సీఎం వైయస్ జగన్కు తెలిపారు. రోజుకు 40 లక్షల చొప్పున మాస్క్లు తయారు చేస్తున్నామని, అత్యంత వేగంగా పంపిణీ కార్యక్రమం జరుగుతోందని వెల్లడించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. డ్వాక్రా సంఘాలకు ఇవ్వడంవల్ల వారికి కష్టకాలంలో ఉపాధి కూడా కలిగిందని.. మాస్క్ ల తయారీ, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు.