కరోనాను త్వ‌ర‌లోనే జయించి వ‌స్తా

 వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి  అంబటి రాంబాబు

గుంటూరు:  క‌రోనాను జ‌యించి త్వ‌ర‌లో మీ ముందుకు వ‌స్తాన‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు.  అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించారు. తన ట్విట్టర్ అకౌంట్ వెరిఫై అయిందని, తన అఫిషియల్ అకౌంట్ నుంచి ట్వీట్ చేస్తున్నానని తెలిపారు. తనకు కరోనా వచ్చిన విషయం అందరికీ తెలిసిందేనని, అయితే కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, పెద్దల ఆశీస్సులతో కరోనాను జయించి త్వరలో మీ ముందుకు వస్తాను... ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు. అంతకుముందు ఓ వీడియోలో ఆయన మాట్లాడుతూ, కరోనా పాజిటివ్ వచ్చినా తాను చాలా ధైర్యంగా ఉన్నానని, ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నానని వెల్లడించారు. ఐసోలేషన్ లో ఉన్నందున ఎక్కువ మందికి ఫోన్ ద్వారా జవాబు ఇవ్వలేకపోతున్నానని తెలిపారు.

Back to Top