మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
కరోనాను త్వరలోనే జయించి వస్తా
23 Jul 2020 7:40 PM
వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
గుంటూరు: కరోనాను జయించి త్వరలో మీ ముందుకు వస్తానని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించారు. తన ట్విట్టర్ అకౌంట్ వెరిఫై అయిందని, తన అఫిషియల్ అకౌంట్ నుంచి ట్వీట్ చేస్తున్నానని తెలిపారు. తనకు కరోనా వచ్చిన విషయం అందరికీ తెలిసిందేనని, అయితే కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, పెద్దల ఆశీస్సులతో కరోనాను జయించి త్వరలో మీ ముందుకు వస్తాను... ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు. అంతకుముందు ఓ వీడియోలో ఆయన మాట్లాడుతూ, కరోనా పాజిటివ్ వచ్చినా తాను చాలా ధైర్యంగా ఉన్నానని, ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నానని వెల్లడించారు. ఐసోలేషన్ లో ఉన్నందున ఎక్కువ మందికి ఫోన్ ద్వారా జవాబు ఇవ్వలేకపోతున్నానని తెలిపారు.