అధికారుల‌ను రాజ‌కీయాల‌కు వాడుకోవ‌డం బాబుకు బాగా తెలుసు

 వైయ‌స్ఆర్‌సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌

ఏబీ వెంకటేశ్వరరావు ఒక పొగరు బోతు

 ప్రకాశం: సీఎం చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఉన్నతస్థాయిలో ప్రమోట్‌ చేసి వారిని రాజకీయంగా వాడుకోవడం చంద్రబాబుకు బాగా తెలుసునని చీరాల ఎమ్మెల్యే  వైయ‌స్ఆర్‌సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్‌ అధికారిగా ఉండి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారన్నారని ఆరోపించారు. ఏబీ వెంకటేశ్వరరావు ఒక పొగరు బోతు.. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎదురుగా ఉన్నా సిగరెట్ తాగుతూ.. పోజులు కొట్టేవాడని విమర్శించారు. చంద్రబాబు అండతో ఏబీ వెంకటేశ్వరరావు చేయని అరాచకాలు లేవని అన్నారు.

వెంకటేశ్వరావును ఈసీ బదిలీ చేస్తే  చంద్రబాబు ఎందుకు కంగారు పడుతున్నారో అర్థం కావటంలేదన్నారు. ఏబీ వెంకటేశ్వరరావుపై లోతుగా విచారణ జరిపితే లక్ష కేసులు పెట్ట వచ్చన్నారు. వ్యస్థలను మేనేజ్ చేస్తూ ...పైకి బుద్ధి మంతుడిలా చంద్రబాబు ప్రవర్థించడం సిగ్గుచేటన్నారు. బాబుకు దమ్ము, ధైర్యం ఉంటే నిజాయితీగా ఎన్నికలకు రావాలని సవాల్‌ చేశారు. పోలీసులును అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో గెలుద్దాం అనుకోవడం ఓటమితో సమానం అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా  చీరాలలో ఎవరు భయపడేది లేదన్నారు.

 

Back to Top