తాడేపల్లి: నూతన మంత్రివర్గ సభ్యులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శాఖలు కేటాయించారు. గతంలో మాదిరిగానే ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులను కేటాయించారు. డిప్యూటీ సీఎంలుగా పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి, అంజాద్ బాషాలను నియమించారు.
మంత్రులకు కేటాయించిన శాఖలు..
పీడిక రాజన్నదొర – డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ
బూడి ముత్యాలనాయుడు – డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి
కొట్టు సత్యనారాయణ – డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ
కె.నారాయణస్వామి – డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ
అంజాద్ బాషా – డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమం
ధర్మాన ప్రసాదరావు - రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్.
సీదిరి అప్పలరాజు – పశుసంవర్థక, మత్స్యశాఖ
బొత్స సత్యనారాయణ – విద్యా శాఖ
గుడివాడ అమర్నాథ్ – పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడులు, వాణిజ్య శాఖ
దాడిశెట్టి రాజా – రోడ్లు, భవనాలు శాఖ
పినిపె విశ్వరూప్ – రవాణా శాఖ
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ – బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ
తానేటి వనిత – హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ
కారుమూరి నాగేశ్వరరావు – పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ
జోగి రమేష్ – గృహ నిర్మాణ శాఖ
మేరుగ నాగార్జున – సాంఘిక సంక్షేమ శాఖ
విడదల రజినీ – వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖ
అంబటి రాంబాబు – జలవనరుల శాఖ
బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి – ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాలు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ, పర్యావరణ
ఆదిమూలపు సురేష్ – మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్
ఆర్కే రోజా – టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ
కాకాణి గోవర్థన్రెడ్డి – వ్యవసాయం, సహకార, మార్కెటింగ్
గుమ్మనూరు జయరాం – కార్మిక శాఖ
ఉషశ్రీచరణ్ – స్త్రీ, శిశు సంక్షేమం