సోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం
మంగళగిరిలో లోకేష్ ఓటమి ఖాయం
13 Mar 2019 6:39 PM
ఏం అభివృద్ధి చేశారని ఓట్లు అడుగుతారు
చంద్రబాబు,లోకేష్లకు ప్రజలు బుద్ధి చెబుతారు
వైయస్ఆర్సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి
అమరావతి:మంగళగిరిలో లోకేష్ ఓడిపోవడం ఖాయమని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.మంగళగిరిలో ఏం అభివృద్ధి చేశారో చంద్రబాబు,లోకేష్ చెప్పాలని డిమాండ్ చేశారు.నాలుగేళ్లుగా రాజధాని ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏ మొహం పెట్టుకుని మంగళగిరి ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో మున్సిపల్ వార్డు కూడా గెలుచుకోలేపోయారని ఎద్దేవా చేశారు.చంద్రబాబు,లోకేష్కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.