అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం వైయస్‌ జగన్‌

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ప్రారంభ‌మైన అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో 20 విపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం వైయస్‌ జగన్‌ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.భారత్‌–చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ అఖిలపక్షాలతో చర్చిస్తున్నారు.ఈ సమావేశంలో ముందుగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.ఇటీవల మరణించిన వీర సైనికులకు నివాళులర్పించారు.
 

Back to Top