చంద్రబాబు బతుకంతా కుట్ర రాజకీయమే

ప్రజల భద్రత విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది

డిశ్చార్జ్‌ అవుతున్న బాధితులందరికీ పరిహారం అందిస్తున్నాం

సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలతో స్టైరిన్‌ తరలింపు మొదలైంది

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు 
 

విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి ఇప్పటికే స్టైరిన్‌ తరలింపు ప్రక్రియ మొదలైందని, ఫ్యాక్టరీలో ఉన్న స్టైరిన్‌ కూడా ట్యాంకర్ల ద్వారా పోర్టుకు తరలించామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. విశాఖలో ఒక్క టన్ను స్టైరిన్‌ కూడా ఉండనివ్వమన్నారు. సంఘటన జరిగిన నాటి నుంచి నేటి వరకు ప్రజల భద్రత విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయకోణంలో చూడడమే  చంద్రబాబు పని అని, బాబు బతుకంతా కుట్ర రాజకీయమేనని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించి బాధితులని ఆదుకునే ప్రయత్నం చేసిందో ప్రతిపక్షాలు గమనించుకోవాలన్నారు.

మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. గ్యాస్‌ ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్ధితులు నెలకొన్నాయని, నిన్నటి నుంచి బాధిత గ్రామాల్లో 24 గంటలపాటు పనిచేసేలా వైద్య బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఆయా గ్రామాల ప్రజలకోసం 15 పడకలతో వైయస్‌ఆర్‌ క్లినిక్‌ ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఎల్‌జీ  పాలిమర్స్‌లో ఉన్న స్టైరిన్‌ని వెనక్కి పంపిస్తున్నామని, ఇప్పటికే ఫ్యాక్టరీలోఉన్న స్టైరిన్‌ని ట్యాంక్‌ల ద్వారా పోర్టుకి తరలించామని వివరించారు. పోర్టు నుంచి షిపుల ద్వారా దక్షిణ కొరియా తరలిస్తున్నామన్నారు. మిగిలిన స్టైరిన్‌ను సైతం ఒకటి రెండు రోజులలో మరో షిప్‌ ద్వారా తరలిస్తామని చెప్పారు.

ప్రజల ఆరోగ్య సమస్యలపై దీర్ఘకాలం పనిచేసేలా ఏఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సుధాకర్‌ ఆధ్వర్యంలో పది మంది వైద్య నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి కన్నబాబు చెప్పారు. ఈ రోజు సాయంత్రం లోపు కోలుకున్న బాధితులని కేజీహెచ్‌ నుంచి డిశ్చార్జ్‌ చేస్తామని, డిశ్చార్జ్‌ అయ్యే ప్రతి బాధితుడికి సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించిన పరిహారాన్ని అందజేసి బస్సులలో గ్రామాలకు తరలిస్తామన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top