పారిశ్రామికవేత్తలకు, కార్మికులకు మేలు చేసేలా కార్మిక చట్టాల రూపకల్పన

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

తిరుపతిలో జరిగిన కార్మికశాఖ మంత్రుల జాతీయ సదస్సును ఉద్దేశించి వర్చువల్‌ విధానంలో మాట్లాడిన సీఎం శ్రీ వైయ‌స్‌ జగన్‌

తాడేప‌ల్లి:  పారిశ్రామికవేత్తలకు, కార్మికులకు మేలు చేసేలా కార్మిక చట్టాల రూపకల్పన చేయాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. కార్మిక చ‌ట్టాల‌ బలోపేతంలో ఈ సదస్సు ద్వారా చేసిన మేధోమధనం ఉపయోగపడుతుందని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్ర‌వారం తిరుపతిలో జరిగిన కార్మిక మంత్రుల జాతీయ సదస్సులో తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం శ్రీ వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి  వర్చువల్‌ విధానంలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం శ్రీ వైయ‌స్‌ జగన్‌ ఏమన్నారంటే...

ఈ సదస్సుకు హాజరైన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు, తిరుపతిలో జరుగుతున్న ఈ సదస్సుకి ముఖ్యులంతా రావడం సంతోషకరం, ఒక జాతీయ సదస్సుకి తిరుపతిని వేదికగా చేసిన కేంద్రమంత్రి శ్రీ భూపేంద్రయాదవ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది, ఈ సదస్సుకి వచ్చిన అందరికీ తిరుమల బాలాజీ దీవెనలు ఉంటాయని భావిస్తున్నాను. గడిచిన రెండు రోజులుగా ఈ సదస్సులో చర్చించిన అంశాలు కార్మిక చట్టాల పటిష్టతకు మరింతగా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. పారిశ్రామికవేత్తలకు, కార్మికులకు మేలు చేసేలా కార్మిక చట్టాల రూపకల్పన, బలోపేతంలో ఈ సదస్సు ద్వారా చేసిన మేధోమధనం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఏపీలో ఈ సదస్సు జరగడం ఆనందదాయకం, అంతేకాక ఇది గౌరవంగా భావిస్తున్నాం, అందరికీ బెస్ట్‌ విషెష్‌ చెబుతూ సీఎం తన ప్రసంగం ముగించారు. స‌మావేశంలో  చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

Back to Top