కుల‌, మ‌తాల‌కు అతీతంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌

కోవిడ్ నియంత్ర‌ణ‌లో దేశంలోనే ఆద‌ర్శంగా నిలిచాం

క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ సంక్షేమ ప‌థ‌కాలు అందించాం

ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌యంలో పంద్రాగ‌స్టు వేడుక‌లు

తాడేపల్లి: కుల‌, మ‌తాల‌కు అతీతంగా సంక్షేమ కార్య‌క్ర‌మాలు అందిస్తున్నామ‌ని, దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజశేఖ‌ర‌రెడ్డి పాల‌న కంటే మూడు, నాలుగు రెట్లు సంక్షేమ ప‌థ‌కాలు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో అందుతున్నాయ‌ని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్స‌వానికి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు. పార్టీ కార్యాల‌యంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంత‌రం రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనాను ఆంధ్రప్రదేశ్‌ సమర్థంగా ఎదుర్కొంటుందని అన్నారు. దేశంలో మిగతా రాష్ట్రాలు కంటే మిన్నగా కోవిడ్ నియంత్రణకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ చర్యలు చేపట్టారన్నారు. కోవిడ్‌ నివారణకు తీసుకుంటున్న చర్యలపై దేశ విదేశాల నుంచి ప్రశంసలు వస్తున్నాయని పేర్కొన్నారు. కోవిడ్‌ పరిస్థితిని సీఎం వైయ‌స్‌ జగన్‌ నిత్యం పర్యవేక్షిస్తున్నార‌న్నారు.

క‌రోనా కష్టకాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టామని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారని, వైయ‌స్‌ జగన్ ముఖ్య‌మంత్రి అయ్యాక రాష్ట్రంలో స్వర్ణ యుగం ప్రారంభమైందన్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు రూ. 36 వేల కోట్లు ప్రజలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేశారని తెలిపారు. రైతులు, మహిళను అన్ని విధాలుగా సీఎం జగన్‌ ఆదుకున్నారన్నారు.  అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో  ముందుకు తీసుకువెళ్తున్నార‌న్నారు. సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను కోర్టులకు వెళ్లి టీడీపీ అడ్డుకుందని మండిపడ్డారు. త్వరలోనే పేదలకు ఇళ్ళ పట్టాలు అందిస్తామ‌న్నారు.

Back to Top