చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
12వ వసంతంలోకి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
10 Mar 2022 9:48 AM
ఈ నెల 12న అన్ని నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు ఎగురవేయాలి
సేవా కార్యక్రమాలు చేపట్టాలి
పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి
వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
అమరావతి: వైయస్ఆర్సీపీ 11 వసంతాలు పూర్తి చేసుకొని మార్చి 12వ తేదీన 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి గత 11 ఏళ్లలో ఎన్నో సవాళ్లను అధిగమించి, సంపూర్ణ ప్రజా బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దాదాపు అన్ని హామీలు అమలు చేయడమే కాకుండా చెప్పని కార్యక్రమాలు కూడా చేసి ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్నారని చెప్పారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన మార్చి 12వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులందరూ కలిసి పార్టీ జెండాలు ఎగుర వేయాలని కోరారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు రంగులు వేసి, పూలమాలలతో అలంకరించాలని, పలు సేవా కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించాలని తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.