కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం
తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి సిరివెన్నెల
01 Dec 2021 10:29 AM
హైదరాబాద్: సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి అని ఏపీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రి పేర్ని నాని నివాళులర్పించారు. ఈ ఉదయం ఫిలిం చాంబర్ వద్ద సిరివెన్నెల భౌతికకాయానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ఏపీ ప్రజల తరఫున సీతారామశాస్త్రి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిరివెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. సిరివెన్నెల కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.