హైద‌రాబాద్‌కు బ‌య‌లుదేరిన వైయ‌స్‌ జగన్  

అమరావతి : వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన షెడ్యూల్‌ విడుదల అయింది. ఆయన శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి హైదరాబాద్‌ బయల్దేరారు. సాయంత్రం 4.30 గంటలకు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అవుతారు. ఈ సందర్భంగా వైయ‌స్‌ జగన్‌ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేల ప్రతినిధి వర్గం గవర్నర్‌కు శాసనసభాపక్షం తీర్మానం కాపీని అందజేసి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేస్తారు. అలాగే సాయంత్రం అయిదున్నరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం అవుతారు. ఈ నెల 30న జరిగే ప్రమాణ స్వీకారానికి కేసీఆర్‌ను వైఎస్‌ జగన్‌ ఆహ్వానించనున్నారు.  
 

Back to Top