మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అన్నొచ్చాడు..ఆసరా ఇచ్చారు
10 Sep 2020 6:01 PM
రేపు వైయస్ఆర్ ఆసరా ప్రారంభం
ఎన్నికల ముందు హామీ..15 నెలల్లోనే అమలు
రాష్ట్రవ్యాప్తంగా 8.71 లక్షల స్వయం సంఘాలకు ఆర్థికసాయం
నాలుగు విడతల్లో మహిళల ఖాతాల్లో రూ.27,168 కోట్లు జమ
రేపు తొలి విడతగా మహిళల ఖాతాల్లో రూ.6,792 కోట్లు
హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు
అమరావతి: పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు ఎన్నికల నాటికి బ్యాంకుల నుంచి ఎంత అయితే అప్పు తీసుకున్నారో అంతా కూడానాలుగు విడతల్లో వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తామని ఎన్నికల ముందు సీఎం వైయస్ జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన15 నెలల్లోనే ఇచ్చిన హామీ నెరవేర్చుతున్నారు. ఈ నెల 11న వైయస్ఆర్ ఆసరా పథకాన్ని సీఎం వైయస్ జగన్ లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. మొన్న జగనన్న అమ్మ ఒడి, నిన్న వైయస్ఆర్ చేయూత, రేపు వైయస్ఆర్ ఆసరా..ఇలా మహిళల స్వావలంభన..సాధికారతే ధ్యేయంగా సీఎం వైయస్ జగన్ అడుగులు వేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గల స్వయం సహాయక సంఘాల్లోని 78,27,693 మంది అక్కచెల్లెమ్మల ఉజ్వల భవిష్యత్ కోసం రూపొందించిన వైయస్ఆర్ ఆసరా పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 11న లాంఛనంగా ప్రారంభిస్తారు. అక్కచెల్లెమ్మలు 7,91,257 స్వయం సహాయక సంఘాల ద్వారా బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.25,383.49 కోట్ల రుణాలను మాఫీ చేయడంలో భాగంగా తొలి విడతగా ఈ నెల 11న రూ.6,792 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందులో ఎస్సీలు 21.70 %, ఎస్టీలు 3.78 %, బీసీలు 47.95 %, ఈబీసీలు 15.02 % ఇతరులు 11.55% ఉన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను గ్రామ, వార్డు సచివాలయాలకు ఆరోజు ఆహ్వానించి పండుగ వాతావరణంలో కార్యక్రమం జరుగుతుంది.
మహిళల ఉజ్వల భవిష్యత్ కోసం..
స్వయం సహాయక సంఘాల మహిళలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను “ప్రజా సంకల్పయాత్ర” లో చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి వారి ఉజ్యల భవిష్యత్ కోసం “వైయస్సార్ ఆసరా” పథకాన్ని నవరత్నాలలో భాగంగా చేసి ప్రభుత్వ ప్రధాన కార్యక్రమంగా ప్రస్తుతం తీసుకురావడం జరిగింది. ఈ పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగై, గ్రామీణ,పట్టణ ప్రాంతాలలో స్వయం సహాయక సంఘాలకు చెందిన పేద మహిళలు ఆర్ధికంగా పురోగతి చెందుతారు. వాణిజ్య, సహకార బ్యాంకులలో ఏప్రిల్ 11, 2019 నాటికి ఋణం తీసుకొని బకాయిలు ఉన్న అన్ని మహిళా స్వయం సహాయక సంఘాలు ఈ పథకానికి అర్హులు. ఏప్రిల్ 11, 2019 నాటికి అక్కచెల్లమ్మలు పొదుపు సంఘాల ద్వారా తీసుకున్న బ్యాంకు రుణాల బకాయిల మొత్తాన్ని4 దఫాలుగా, నేరుగా వారి సంఘాల పొదపు ఖాతాలకు జమ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.
వైఎస్సార్ ఆసరా క్రింద 4 విడతలుగా ఇవ్వబోవు బకాయిల మొతాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసి, ఈబిసి, కాపు, మైనారిటీ, క్రిస్టియన్ కార్పొరేషన్ల ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మల అప్పు నిల్వ మొత్తం రూ. 25,383.49 కోట్లు నాలుగేళ్లలో నేరుగా వారి సంఘాల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది ఇప్పటికే వైఎస్సార్ చేయూత ద్వారా 23 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద అక్కచెల్లెమ్మలకు దాదాపు రూ. 4,312.5 కోట్లు అందించడం జరిగింది.
స్వయం సహాయక సంఘాల అక్క చెల్లెమ్మలకు వడ్డీ భారం లేకుండా ఇప్పటికే రూ.1400 కోట్లు అక్క చెల్లెమ్మల తరుపున ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించింది. ఇకపై కూడా ప్రతి ఏటా వడ్డీ మొత్తం రూ.1400 కోట్లు ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుందన్నారు. SLBC లెక్కల ప్రకారం ఉన్న రూ.14,204 కోట్ల డ్వాక్రా రుణాలను, గత ప్రభుత్వం మాఫీ చేస్తానని నమ్మబలికి డ్వాక్రా సంఘాలను అప్పుల పాలు చేసారన్నారు. తత్ఫలితంగా సుమారు 18.36 % డ్వాక్రా సంఘాలు నిరర్ధక ఆస్తులుగా (NPA) మిగిలిపోగా, చాలా సంఘాలు నిర్వీర్యమైపోగా, సుమారు రూ. 3,036 కోట్ల వడ్డీని అక్కచెల్లెమ్మలే బ్యాంకులకు అపరాదపు వడ్డీతో సహా చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. కానీ, జగనన్న అలాకాకుండా ఎన్నికల రోజు వరకు అక్కచెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే వారు యదావిధిగా రుణాలు చెల్లించుకుంటూ ఉండాలని ఆనాడే చెప్పడం జరిగింది. మాటకనుగుణంగా అక్క చెల్లెమ్మలు ఈ రోజు నాటికి 99.27% రుణాల చెల్లింపును యదావిధిగా కొనసాగించటంతో, ప్రస్తుతం ఎన్పీఏ (NPA) లు కేవలం 0.73 శాతం మాత్రమే ఉన్నాయి. ఇచ్చిన హామీమేరకు వైయస్ఆర్ ఆసరా ద్వారా పొదుపు సంఘాలకు డబ్బులు జమ చేయనున్నారు. దీంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి వైయస్ఆర్ ఆసరా వారోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.