చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
సర్వేజనం..జయహో జగన్
25 Jan 2019 11:38 AM
19 ఎంపీ సీట్లతో వైయస్ఆర్ సీపీ స్వీప్!
వైయస్ జగన్ సారథ్యంలో పార్టీ విజయభేరి ఖాయం
పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుస్తుందన్న సర్వే
ఓట్ల పరంగా చూసినా 8.2 % తేడాతో ‘ఫ్యాన్’ ప్రభంజనం
అధికార టీడీపీ ఏపీలో 6 ఎంపీ సీట్లకే పరిమితం
బీజేపీ, కాంగ్రెస్లకుఒక్క స్థానం కూడా దక్కదు
‘రిపబ్లిక్ టీవీ – సీ ఓటర్’ తాజా సర్వేలో వెల్లడి
అమరావతి: మరి కొద్ది నెలల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సీట్లలో నెగ్గి ఘన విజయం సాధించనుందని ‘రిపబ్లిక్ టీవీ – సీ ఓటర్’ సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. సీఎం చంద్రబాబు సారథ్యంలోని అధికార టీడీపీ 6 ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని ఈ సర్వే తేల్చింది. ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరుతో జరిగిన ఈ సర్వే ఫలితాలను రిపబ్లిక్ టీవీ గురువారం విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని మొత్తం 25 లోక్సభ స్థానాలకుగానూ వైఎస్సార్ సీపీకి 19 ఎంపీ సీట్లు, టీడీపీకి కేవలం ఆరు సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లు ఏపీలో ఒక్క స్థానంలో కూడా గెలవలేవని పేర్కొంది.
ఓట్ల శాతంలోనూ వైయస్ఆర్ సీపీ స్పష్టమైన ఆధిక్యం
ఓట్ల శాతం పరంగా చూసినా కూడా సర్వేలో వైయస్ఆర్ సీపీదే పైచేయిగా ఉంది. వైయస్ఆర్ సీపీకి 41.3 శాతం ఓట్లు, టీడీపీకి 33.1 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లు సర్వే వెల్లడించింది. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసినా ఏపీలో టీడీపీకి 15 ఎంపీ సీట్లు మాత్రమే లభించడం గమనార్హం. బీజేపీకి రెండు ఎంపీ సీట్లు రావడం తెలిసిందే. గత పార్లమెంట్ ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ 8 ఎంపీ సీట్లను సాధించింది. సీ ఓటర్ సంస్థ గతంలో వెల్లడించిన సర్వేలో కూడా వైయస్ఆర్ సీపీ ఘన విజయం సాధిస్తుందని అంచనా వేసిన సంగతి తెలిసిందే.