భారీగా పెరగనున్న ప్రభుత్వ మెడికల్‌ పీజీ సీట్లు 

అమరావతి: రాష్ట్రంలో వైద్య విద్యకు స్వర్ణయుగం. వైద్య ఆరోగ్యరంగంపై ముఖ్యమంత్రి తదేక దృష్టి కారణంగా సానుకూల ఫలితాలు వ‌స్తున్నాయి.     రాష్ట్రంలో గణనీయంగా ప్రభుత్వ మెడికల్‌ పీజీ సీట్లు పెర‌గ‌నున్నాయి.     ప్రమాణాలకు అనుగుణంగా సిబ్బందిని ఉంచడంతో పెరగనున్న సీట్లు.

  •  2019 వరకూ రాష్ట్రంలో మెడికల్‌ పీజీ సీట్ల సంఖ్య 970. 
  •  ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న చర్యల కారణంగా 2022లో మరో 207 సీట్లు పెరుగుదల. 
  •  ఇప్పుడు అదనంగా 746 సీట్లకు దరఖాస్తు చేసేందుకు అవకాశం. ఈ ఏడాదిలో ఈ సీట్లు పెరుగుదల దాదాపు ఖరారు.
  •  అంటే స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 2019 వరకూ మొత్తంగా రాష్ట్రంలో ఉన్న పీజీ సీట్లు 970 అయితే ఈ మూడున్నరేళ్లలోనే మరో 953 సీట్లు పెరిగనట్టు అవుతుంది. 
  •  మూడున్నరేళ్లలోనే మెడికల్‌ పీజీసీట్లు రెట్టింపు అవుతున్నాయి. 
  •  తద్వారా పెద్ద సంఖ్యలో వైద్య నిపుణుల రూపంలో మానవవనరుల తయారీ. 
  •  ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా వైద్య బోధనా సిబ్బందిని నియమిస్తున్న ప్రభుత్వం. 
  •  1254 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లని నియమించారు. 106 ప్రొఫెసర్‌ పోస్టులను క్రియేట్‌ చేశారు, 312 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను క్రియేట్‌ చేశారు, 832 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులను క్రియేట్‌ చేసిన ప్రభుత్వం. వేగంగా వీటిని భర్తీ చేసే ప్రక్రియ. 
  •  అవసరమనుకుంటే ప్రైవేటు రంగంలో ఇచ్చే భారీ వేతనాలను ప్రభుత్వరంగంలోనూ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. 
  •  ఇప్పటికే వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలాంటి పద్ధతులను వైద్యారోగ్యశాఖ అవలంబిస్తోంది. 
  •  దీంతో ప్రభుత్వ మెడికల్‌ పీజీ సీట్ల పెరుగుదలకు మార్గం సుగమమైంది. ఇది ఒక శుభపరిణామమని అధికారులు పేర్కొంటున్నారు.. 
  •  దీనివల్ల స్పెషాల్టీ, సూపర్‌ స్పెషాల్టీ వైద్య సేవలు గణనీయంగా మెరుగుపడ్డమే కాకుండా, వైద్య రంగంలో నిపుణుల సంఖ్య పెరుగుతుందన్న అధికారులు.
  •  ముఖ్యమంత్రి తీసుకున్న చర్యల కారణంగానే సానుకూల ఫలితాలు వచ్చాయన్న అధికారులు.
  •  రాష్ట్రంలో కొత్తగా నిర్మాణం అవుతున్న మెడికల్‌ కాలేజీల్లో బోధనావసరాలకు ఇది ఉపయోగపడుతుందన్న అధికారులు.
  •  17 మెడికల్‌ కాలేజీలు పూర్తైతే, నిర్ణీత సమయానికి సుమారు మరో ౩ వేల పీజీసీట్లుకూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్న అధికారులు.
  •  దీనివల్ల రాష్ట్రంలో జనాభాకు అవసరాలకు తగినట్టుగా, ప్రతి ప్రాంతంలోకూడా అత్యంత నాణ్యమైన వైద్యం ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్న అధికారులు.
Back to Top