పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
కల్లు గీత కార్మికులకు నిజమైన భరోసా..‘వైయస్ఆర్ గీత కార్మిక భరోసా’
20 Jan 2023 12:06 PM
కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రమాదవశాత్తూ మరణించే, శాశ్వతంగా వైకల్యం బారినపడే కల్లు గీత కుటుంబాలకు రూ.10లక్షలు చొప్పున పరిహారం
అమరావతి: ఎవరూ డిమాండ్ చేయకుండానే ప్రమాదవశాత్తూ మరణించే, శాశ్వతంగా వైకల్యం బారినపడే కల్లు గీత కుటుంబాలకు సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి రూ.10లక్షల పరిహారాన్ని ప్రకటించారు. తద్వారా కల్లు గీత వృత్తిపై ఆధారపడిన 95,245 కుటుంబాలకు ముఖ్యమంత్రి భరోసానిచ్చారు.
కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కల్లు తీస్తూ ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి పడి మరణించిన, శాశ్వత అంగవైకల్యం బారిన పడే కల్లు గీత కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘వైయస్ఆర్ గీత కార్మిక భరోసా’ పథకాన్ని ప్రకటించింది. ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి పడి మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబానికి కూడా రూ.10లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. చెట్టుపై నుంచి పడి శాశ్వత అంగవైకల్యం బారినపడే కల్లుగీత కార్మికునికి కూడా రూ.10లక్షలు పరిహారం అందిస్తారు.
ఇందులో రూ.5 లక్షలు కార్మిక శాఖ, మరో రూ.5లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా రూపంలో అందిస్తాయి. కల్లు తీస్తూ ప్రమాదవశాత్తూ అంగవైకల్యం బారిన పడినవారు దరఖాస్తు చేసుకుంటే ఎక్సైజ్ శాఖ నిబంధనలకు అనుగుణంగా వైకల్యం సర్టిఫికెట్ను జారీచేస్తుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన రాష్ట్ర కల్లుగీత విధానం 2022–2027 ప్రకారం ఈ పరిహారాన్ని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.
సీఎం వైఎయ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ‘వైయస్ఆర్ గీత కార్మిక భరోసా’ పథకం రాష్ట్రంలోని లక్షలాది మంది గీతకార్మిక కుటుంబాలకు అండగా నిలవనుంది. రాష్ట్రంలో 95,245 కల్లు గీత కుటుంబాలు తమ కులవృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఏటా 1,200 మంది గీత కార్మికులు కల్లు తీస్తూ ప్రమాదానికి గురవుతున్నారు. వారిలో దాదాపు 40శాతం మంది దుర్మరణం చెందుతుండగా మిగిలిన వారు శాశ్వతంగా వైకల్యం బారినపడుతున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రమాదవశాత్తూ మరణించిన కుటుంబాలకు రూ.2లక్షలే పరిహారంగా అందించేవారు.
దీనిని పెంచాలని గీత కార్మిక కుటుంబాలు డిమాండ్ చేయడంతో చంద్రన్న బీమా పథకం నుంచి రూ.5లక్షలు ఎక్స్గ్రేషియా అందిస్తామని టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. కానీ సక్రమంగా అమలుచేయలేదు. ఈ నేపథ్యంలో.. ఎవరూ డిమాండ్ చేయకుండానే ప్రమాదవశాత్తూ మరణించే, శాశ్వతంగా వైకల్యం బారినపడే కల్లు గీత కుటుంబాలకు సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి రూ.10లక్షల పరిహారాన్ని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తద్వారా కల్లు గీత వృత్తిపై ఆధారపడిన 95,245 కుటుంబాలకు ముఖ్యమంత్రి భరోసానిచ్చారు.