బస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి
ఏపీ నంబర్ వన్
24 Jul 2021 11:32 AM
‘వైయస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ అమలులో రాష్ట్రం ఆగ్రస్థానం ’
అమరావతి: వైయస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం అమల్లో దేశంలోనే ఏపీ నంబర్ వన్గా నిలిచిందని వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్ వెల్లడించారు. పీఎం కిసాన్ పోర్టల్లో నమోదు చేసుకున్న వారిలో అర్హత గల వారికి పెట్టుబడి సాయం అందేలా చేయడం, రికార్డు స్థాయిలో గ్రీవెన్స్ను పరిష్కరించడంతో పాటు.. క్షేత్ర స్థాయి పరిశీలన వంటి అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపారంటూ నీతి ఆయోగ్ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్గా ఏపీని ప్రకటించినట్టు చెప్పారు.
వైయస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద గడిచిన మూడేళ్లుగా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది పీఎం కిసాన్ పోర్టల్లో 58,11,593 మంది రిజిస్టర్ చేసుకోగా, వారిలో 49,82,634 మందిని అర్హులుగా గుర్తించినట్టు తెలిపారు. కేంద్రం నిర్దేశించిన ప్రమాణాలన్నీ పాటిస్తూ పోర్టల్లో నమోదు చేసుకున్న వారిలో 86 శాతం మందిని అర్హులుగా గుర్తించి సాయం అందించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు.