ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
చంద్రబాబుకు హస్తినే కాదు, అమరావతీ దూరమే
07 Aug 2022 7:37 PM
ఎటూ వెళ్లరూ, ఎటూ చూడరు! దృష్టంతా సొంత లాభంపైనే!
అమరావతి: ఎప్పుడో పాతికేళ్ల క్రితం దేశ రాజధాని న్యూఢిల్లీలో ‘చక్రం తిప్పాను’ అని ఇప్పటికీ మధురస్మృతిగా చెప్పుకునే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఎట్టకేలకు హస్తినలో గడిపే అవకాశం శనివారం వచ్చింది. భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాలు సీనియర్ బాబుగారికి ఇంతటి మహద్భాగ్యం కల్పించాయి. దీంతో, మళ్లీ పాత వరవడిలోకి వచ్చే ప్రయత్నం చేశారు మాజీ హైటెక్ సీఎం.
‘మీరు తరచూ ఢిల్లీకి ఎందుకు రావడం లేదు?’ అని చంద్రబాబును ప్రధాని నరేంద్ర మోదీ అడిగారని టీడీపీ మౌత్ పీస్గా ఉపకరించే ఓ తెలుగు దినపత్రిక తెలిపింది. ప్రధాని మోదీజీ చెప్పినట్టు విభజిత ఆంధ్రప్రదేశ్ ‘తొలి ముఖ్యమంత్రి’ చంద్రబాబు గారు ఒక్క ఢిల్లీకే కాదు, ఏపీ రాజధాని అమరావతికే రావడం లేదు. ఢిల్లీకి రమ్మని పిలిచేవారు లేరు. అమరావతిలో ఉండాలని అడిగేవారూ లేరు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు కాలంలో మాదిరిగా ఉత్తరాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కనీసం మాట్లాడే ప్రయత్నం చూడా చేయడం లేదు చంద్రబాబు. యూపీ, బిహార్ ను గతంలో పరిపాలించిన పూర్వపు జనతా పరివార్ పార్టీలు సైతం చంద్రబాబును పట్టించుకోవడం లేదు. దీనికి కారణం ఈ పార్టీల వైఖరిలో మార్పు కాదు. చంద్రబాబు ఉష్ట్రపక్షి ధోరణి జాతీయ రాజకీయాల్లో ఆయనను ఏకాకిని చేసింది.
సీఎం పీఠంపై ఉంటే–అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడన్తో సైతం మాట్లాడడానికి ప్రయత్నించే బాబు రాజకీయంగా నేడు ఒంటరి. 1996–2004 మధ్య కేంద్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించానని చెప్పుకోవడం ఆయనకు ఆనవాయితీగా మారడమేగాదు, మళ్లీ ‘అలాంటి రోజులు ఎప్పుడొస్తాయా?’ అని ఆయన ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తోంది. విభజిత ఏపీలో సుపరిపాలన అందిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నిరంతర అడ్డగోలుం విమర్శలు, పాలకపక్ష నేతలపై వ్యక్తిగత దాడులు చేస్తూ, వారి శీలహననంపైనే దృష్టి పెట్టడం వల్ల చంద్రబాబుకు మెడ తిప్పుకునే తీరిక కూడా లేకపోయిందట.
ప్రధానితో చెప్పాల్సినవి చాలా ఉన్నాయట!
చంద్రబాబుతో చాలా విషయాలు మాట్లాడాలని ఉందని ప్రధాని అన్నట్టు కూడా పై మీడియా సంస్థ తెలిపింది. బాగుంది. ప్రధాని పిలిస్తే రెక్కలు కట్టుకుని ఢిల్లీ వచ్చి వాలిపోవడానికి సదా సిద్ధంగా ఉండే చంద్రబాబుతో నరేంద్ర మోదీ గారు ఎలాంటి విషయాలు చర్చిస్తారో చూద్దాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నివాసంలో ఒంటరి జీవితం గడుతూనే, జగన్ సర్కారుపై వికృత దుష్ప్రచారానికి మార్గదర్శనం చేసే చంద్రబాబుపై ప్రధాని మోదీజీ జాలిపడడం నిజంగా వార్తే. చంద్రబాబు తొందర్లోనే ప్రధానితో భేటీకి అపాంట్మెంట్ తెచ్చుకుని జాతిహితం కోసం ఎలాంటి సలహాలు ఇస్తారో మరి! బిల్ క్లింటన్, బిల్ గేట్స్ పేర్లు చెప్పుకుని పదేళ్లు గడిపిన బాబుకు దేశ ప్రధాని అవసరం, భారత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే అవసరం ఇన్నాళ్లకు కనిపిస్తున్నాయి. 1996లో బాగా పరిచయమైన ఢిల్లీ వీధులను మర్చిపోకుండా ఉండాలంటే ఇలా హస్తినకు కేంద్ర సర్కారు ఆహ్వానంపై రెండేళ్లకు ఒకసారైనా చంద్రబాబు గారికి వచ్చే అవకాశం ఉంటే మంచిదేమో!