వైఎస్ జ‌గ‌న్ ప‌వ‌ర్ ఫుల్ వ్యాఖ్య‌లు

విజ‌య‌వాడ‌: రైతుల త‌ర‌పున భూ సేక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా జ‌రిగిన ధ‌ర్నాలో మాట్లాడిన వైఎస్ జ‌గ‌న్ ప‌వ‌ర్ ఫుల్ వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు చేస్తున్న కుయుక్తుల్ని ఎండ‌గ‌ట్టారు. అందులో కొన్ని..
  • రాజ‌ధాని ప్రాంతంలో ప‌చ్చ‌ని భూములు లేవట‌. రెండు వేల ఎకరాలు మాత్ర‌మే పంట‌, మిగిలిన‌వి మామూలే భూములే అంటారు. సాక్షాత్తు ప్ర‌భుత్వ‌మే అబ‌ద్దాలు చెబుతోంది
  • మ‌న‌సున్న‌వాడు ముఖ్య‌మంత్రి కావాలి. భూ బ‌కాసురుడు ముఖ్య‌మంత్రి అయ్యాడు. 
  • చంద్ర‌బాబూ..! అధికారం ఎల్ల‌కాలం మీ ద‌గ్గ‌రే ఉండ‌దు. మీ ప్ర‌భుత్వం పోతుంది. రెండు, మూడేళ్ల‌కు పోతుంది. బంగాళాఖాతంలో క‌లుస్తుంది.
  • వ‌చ్చేది మా ప్ర‌భుత్వ‌మే. మా ప్ర‌భుత్వం వ‌చ్చిన వెంట‌నే భూముల్ని పూల‌ల్లో పెట్టి వెన‌క్కి ఇచ్చేస్తాం.
  • చంద్ర‌బాబు పాల‌న అంతా మోసం.. మోసం.. అన్న‌మూడ‌క్ష‌రాల మీద న‌డుస్తోంది. 
  • ప్యాకేజీ ఇస్తే చాలు అంటూ స‌రిపెడుతున్నారు. అన్నీ విభ‌జ‌న చ‌ట్టంలోనివి రాసి చూపిస్తున్నారు. 
  • ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కోట్ల‌కు కోట్లు ఖర్చు పెట్టారు. కోట్లు ఇవ్వ‌చూపుతూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయాడు చంద్ర‌బాబు
  • నుదుటి రాత రాసేది దేవుడు. ఇది రాసి ఉంటే చంద్ర‌బాబు కాదు కదా వాళ్ల నాయ‌న కూడా ఆప‌లేడు ఆ స్థానంలో కూర్చోవ‌డానికి
  • బంద్ ను వ్య‌తిరేకించేందుకు నానా కుయుక్తులు చేస్తారు. అరెస్టులు చే్స్తారు. ప్రజ‌లే ముందుకు వ‌చ్చి బంద్ ను విజ‌య‌వంతం చేయాలి.
Back to Top