చంద్రబాబుకు పాలించే అర్హత లేదు

అసెంబ్లీః
 ఏపీ ప్రతిపక్ష నేత , వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రభుత్వంపై
నిప్పులు చెరిగారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ తో చంద్రబాబుకు ప్రత్యక్ష
సంబంధాలున్నాయన్నారు.  ఆడవారి మానప్రాణాలతో చెలగాటం అడి వీడియోలు తీసిన
టీడీపీ నేతలను  చంద్రబాబు కాపాడుతున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. సెక్స్
రాకెట్ కేసును దారి మళ్లించేందుకు చంద్రబాబు పడుతున్న తిప్పలు చూస్తుంటే..
ఇంత దారుణమైన సీఎం దేశంలో ఎక్కడా లేరనిపిస్తోందని ధ్వజమెత్తారు.
చంద్రబాబుకు ఒక్కరోజు కూడా పాలించే అర్హత లేదని విరుచుకుపడ్డారు.
అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...
 
సెక్స్ రాకెట్‌కు సంబంధించి స్పష్టంగా ఆధారాలున్నాయి
చంద్రబాబు ఆశీస్సులతోనే ఇదంతా జరుగుతోంది
ఆ నిందితులు చంద్రబాబుతో, ఇంటెలిజెన్స్‌ డీజీతో టీడీపీ ఎమ్మెల్యేలతో ఉన్న ఫొటోలు కూడా ఉన్నాయి.
నిందితులను విదేశాల్లో వదిలేసి బోడె ప్రసాద్ వచ్చినా ఆయన్ను విచారించలేదు
మరో ఎమ్మెల్సీ సొంత తమ్ముడే ఈ కేసులో నిందితుడు
ఎమ్మెల్సీతో పాటు ఆయన సోదరుడు ఒకే ఇంట్లో ఉంటారు
అయినా ఆ ఎమ్మెల్సీ తనకేమీ తెలియదంటాడు
అయినా టీడీపీ ఎమ్మెల్యేలపై ఎలాంటి కేసులుండవు, విచారణ జరగదు
అతి దారుణమైన సంఘటనను ప్రశ్నించిన మాపార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు
కేసును నీరుగార్చేందుకు వడ్డీ వ్యాపారులపై దాడులు చేస్తున్నారు
మా పార్టీ వైఖరిని బీఏసీలో స్పష్టంగా చెప్పినా అబద్ధాలు ఆడుతున్నారు
చంద్రబాబును కాల్‌బాబు, మనీబాబు, సెక్స్‌రాకెట్ బాబు అని కూడా అనవచ్చు
చంద్రబాబుకు సడన్‌గా అంబేద్కర్ గుర్తుకొచ్చారు
అంబేద్కర్ గారిని కూడా రాజకీయ అవసరాలకు వాడుకునే వ్యక్తి చంద్రబాబు మాత్రమే
నా జీవితంలో ఇంత దారుణమైన వ్యక్తిని చూడలేదు
సభలో మంత్రి ఒకరోజు సస్పెండ్ చేయమని చెబితే, స్పీకర్ రెండు రోజులు సస్పెండ్ చేశారు
ఇలాంటి దుశ్శాసన, దుర్మార్గపు కౌరవ సభ ఇంకోటి ఉండదు
తప్పుచేసిన ఎమ్మెల్యేను ప్రశ్నించే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు
వనజాక్షి, రిషితేశ్వరి కేసులో ఒక్కరిని కూడా నిలదీసిన పాపాన పోలేదు
లాండ్, శాండ్, లిక్కర్, సెక్స్ మాఫియాలో చంద్రబాబు భాగముందని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు.
Back to Top